కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ.. భద్రాద్రి జిల్లాను నిర్లక్ష్యం చేశారంటూ కాంగ్రెస్పై బీఆర్ఎస్ విమర్శలు
కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ.. భద్రాద్రి జిల్లాను నిర్లక్ష్యం చేశారంటూ కాంగ్రెస్పై బీఆర్ఎస్ విమర్శలు
కొత్తగూడెం: పక్కనే ప్రవహిస్తున్న గోదావరి జలాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మించారని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు.
జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆమె ఖండించారు. సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి జిల్లా రైతులకు పూర్తిగా అందించకుండా ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదన్నారు.
కన్నేపల్లి పంప్హౌస్ ద్వారా సాగునీటిని తెలంగాణ రైతులకు అందించాలని కోరిన రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే రైతుబంధు నిధుల చెల్లింపులు నిలిపివేశారని, రైతు బీమా పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రశ్నిస్తామని, 31 నెలల పాలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రారంభోత్సవాలు చేయడం తప్ప ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో లచ్చిరాం, సూరిబాబు, సుందర్ పాసి, పూర్ణ, పాషా, లక్ష్మి, సోహెబ్, పేరం సందేశ్, కుమార్, మద్దెల సుదీర్, లక్కినేని షణ్ముఖ సాయి తదితరులు ఉన్నారని తెలిపారు.

Post a Comment