ముందుగానే నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించే సూచనలు
హైదరాబాద్, : భారత వాతావరణశాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కాలానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయి. మే 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.
సాధారణంగా రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకి, జూలై 15 నాటికి దేశమంతా వ్యాపిస్తాయి. కానీ ఈ ఏడాది ఈ ప్రక్రియ మరింత వేగంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం, మే 25 నాటికే రుతుపవనాలు కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. అదే విధంగా, జూలై 11 నాటికి దేశమంతా ఈ రుతుపవనాల ప్రభావం వ్యాపించే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ ముందస్తు రుతుపవన ప్రవేశం వ్యవసాయ రంగానికి ఆశాజనక పరిణామంగా భావించబడుతోంది. రైతులు తమ సాగు కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ఇది తోడ్పడనుంది.

Post a Comment