కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ 117 మందికి జరిమానా విధించిన న్యాయస్థానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 117 మంది వ్యక్తులు కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో వారికి జరిమానాలు విధించబడ్డాయి. బుధవారం ఈ కేసులపై విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు ప్రకటించారు.
కొత్తగూడెం వన్టౌన్ ఎస్.ఐలు తుంగ రాకేష్ మరియు జి.విజయల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 24 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షల ద్వారా రుజువైంది. నేరాన్ని అంగీకరించిన వారిని కోర్టులో హాజరు పరచగా, వారికి మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు.
అలాగే, ట్రాఫిక్ ఎస్.ఐ కె. నరేష్ నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో 13 మందికి మద్యం సేవించడమై రుజువు కావడంతో కోర్టులో హాజరు పరచగా, వారు కూడా నేరాన్ని ఒప్పుకొని జరిమానాలు చెల్లించారు.
టూ టౌన్ ఎస్.ఎచ్.ఓ. అప్పటి టి. రమేశ్ కుమార్ మరియు ఏం. సెల్వరాజ్ బృందం నిర్వహించిన తనిఖీల్లో 30 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికారు. వారు కూడా కోర్టులో నేరం అంగీకరించడంతో జరిమానాలు విధించబడ్డాయి.
సుజాతనగర్ ఎస్.ఎచ్.ఓ. ఎం. రమాదేవి తన బృందంతో తనిఖీలు నిర్వహించి 10 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత వారు నేరాన్ని ఒప్పుకొని జరిమానాలు చెల్లించారు.
చంద్రుగొండ ఎస్.ఎచ్.ఓ. పి. శివరామకృష్ణ నిర్వహించిన తనిఖీల్లో కూడా 10 మంది మద్యం తాగిన వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన వారు జరిమానాలు చెల్లించారు.
ములకలపల్లి ఎస్.ఎచ్.ఓ. కిన్నర రాజశేఖర్ తన బృందంతో కలిసి 30 మందిని తనిఖీ చేసి మద్యం తాగినట్లు రుజువు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టి, నేరాన్ని అంగీకరించడంతో జరిమానాలు విధించారు.
ఈ చర్యలు ప్రజల ప్రాణభద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న కఠినమైన చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారు తాము, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టుతున్నారన్న విషయాన్ని గుర్తించాలి. పోలీసులు ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో మరింత కఠినంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు..
Post a Comment