ఘోర విమాన ప్రమాదం – బీజే మెడికల్ కాలేజీపై కూలిన ఎయిర్ఇండియా విమానం
గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఈ రోజు మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ఇండియా కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (AI 171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాల మధ్యలో సాంకేతిక సమస్యలతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం.
✈️ బీజే మెడికల్ కాలేజీపై విమానం కూలింపు – 20 మంది మృతి
AI 171 విమానం అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో అక్కడి మెడికో విద్యార్థులు, సిబ్బందిలో 20 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.
🕐 ప్రమాదం సమయం
విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్లో పొగలు రావడంతో విమానం నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్టు ప్రాథమిక సమాచారం.
👨✈️ విమానంలో ప్రయాణికుల వివరాలు
- మొత్తం ప్రయాణికుల సంఖ్య: 242
- సిబ్బంది: 12 (2 పైలట్లు, 10 క్యాబిన్ సిబ్బంది)
- భారతీయులు: 169
- బ్రిటన్ వాసులు: 53
- కెనడియన్ పౌరుడు: 1
- పోర్చుగల్ పౌరులు: 7
- చిన్నారులు: 13 (2 శిశువులు)
🛑 విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ
విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రాణాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
🚨 సహాయక చర్యలు జోరుగా
విమాన ప్రమాదం జరిగిన వెంటనే బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి. 90 మంది చొప్పున మూడు ప్రత్యేక బృందాలుగా విభజించి బాధితులను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. మృతదేహాల వెలికితీత, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించే పని వేగంగా జరుగుతోంది.
🏢 భారీ ఆస్తి నష్టం
విమాన ప్రమాదంతో బీజే మెడికల్ కాలేజీ భవనానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తతతో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు.
Post a Comment