ఫలించిన ట్రైబల్ జర్నలిస్టుల కృషి
హనుమకొండ డీఈవో వాసంతి సర్క్యులర్ జారీ
హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్న ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు గుడ్న్యూస్. అనేక సంవత్సరాలుగా ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తున్న ఆదివాసీ జర్నలిస్టుల కుటుంబాలకు శుభవార్త లభించింది. వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి బుధవారం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు.
ఇది ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ, హనుమకొండ జిల్లా శాఖ చేసిన నిరంతర కృషికి ఫలితం. ఈ నెల 10వ తేదీన డీఈవో వాసంతికి వినతిపత్రం సమర్పించగా, సానుకూలంగా స్పందించి ఆమె వెంటనే చర్యలు చేపట్టి సర్క్యులర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకట్ నాయక్ మాట్లాడుతూ, “జర్నలిస్టులు నిత్యం సమాజంలోని సమస్యలను బయటపెట్టి ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్నారు. అలాంటి వారి పిల్లలకు విద్యారంగంలో మద్దతు ఇవ్వడం ఎంతో అభినందనీయమైన విషయం. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధంగా రాయితీలు లభించేలా కృషి కొనసాగిస్తాం,” అని తెలిపారు.
ఈ నిర్ణయంతో జాతీయ, ప్రాంతీయ పత్రికలు, టీవీ ఛానెల్స్ లో పనిచేస్తున్న ఆదివాసీ జర్నలిస్టుల కుటుంబాలకు మద్దతుగా మారి, వారికి విద్యారంగంలో కొత్త వెలుగు చూపించనుంది.
Post a Comment