-->

భద్రాద్రి కొత్తగూడెంలో 6 మంది మావోయిస్టుల లొంగుబాటు

జనవరి నుంచి ఇప్పటివరకు 306 మంది దళసభ్యులు సాధారణ జీవితంలోకి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81 & 141 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్ అధికారులు కలసి అమలు చేస్తున్న “ఆపరేషన్ చేయూలో” కార్యక్రమం ఫలితంగా, నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఆరుగురు దళ సభ్యులు — వీరిలో ముగ్గురు మహిళలు — ఈరోజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో PPCM/ACM స్థాయిలో 1, పార్టీ సభ్యులు 2, మిలీషియా సభ్యులు 3 మంది ఉన్నారు. వీరందరూ తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందించే పునరావాస సౌకర్యాల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడిచి కుటుంబాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించారు.

జనవరి 2025 నుంచి ఇప్పటివరకు ఈ జిల్లాలోనే మొత్తం 306 మంది మావోయిస్టులు — DVCMలు 4, ACMలు 20, పార్టీ సభ్యులు 39, మిలీషియా సభ్యులు 110, RPC సభ్యులు 35, DAKM/KAMSలు 47, CNM సభ్యులు 30, GRD సభ్యులు 21 — సాధారణ జీవితంలోకి వచ్చారు.

అడవుల్లో క్షీణించిన మావోయిస్టు పరిస్థితి
ఎస్పీ ప్రకారం, అడవుల్లో మావోయిస్టులకు ఆదివాసీ ప్రజల సహకారం తగ్గిపోవడం, ఆహార కొరత, ఆరోగ్య సమస్యల వల్ల కేడర్ శక్తి తగ్గిపోయింది. 90% పైగా క్యాడర్లు పేద ఆదివాసీలు కావడంతో, తమ కుటుంబాల అభివృద్ధి కోసం పార్టీని వీడుతున్నారు. ఇది శుభపరిణామమని పోలీసులు పేర్కొన్నారు.

తక్షణ ఆర్థిక సహాయం
లొంగిపోయిన ఆరుగురికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున మొత్తం రూ.1,50,000 అందించారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలు సిద్ధమైన తర్వాత మిగిలిన పునరావాస నిధులు చెక్కుల రూపంలో జమ చేయబడతాయి.

లొంగిపోయిన వారి వివరాలు

క్ర.సం పేరు హోదా ప్రాంతం పార్టీ
1 మడకం లక్ష్మీ (30) PPCM, 4వ ప్లాటూన్, కుంటా ఏరియా కమిటీ పాములూరు, కిస్ట్రం పీఎస్ లిమిట్స్ సీపీఐ మావోయిస్టు
2 సోడి భీమే (30) పార్టీ సభ్యురాలు, 4వ ప్లాటూన్, కుంటా ఏరియా కమిటీ దూలేడ్, చింతగుప్పా పీఎస్ లిమిట్స్, సుక్మా (CG) సీపీఐ మావోయిస్టు
3 సోడి రాజే (25) పార్టీ సభ్యురాలు, 4వ ప్లాటూన్, కుంటా ఏరియా కమిటీ మెడిగూడ, పామేడు పీఎస్, బీజాపూర్ (CG) సీపీఐ మావోయిస్టు
4 మడివి సోనా (35) మిలీషియా డిప్యూటీ కమాండర్, పలగూడెం RPC గోమ్గూడ, పామేడు పీఎస్, బీజాపూర్ (CG) సీపీఐ మావోయిస్టు
5 మడివి భీమా (52) మిలీషియా సభ్యుడు, పలగూడెం RPC గోమ్గూడ, పామేడు పీఎస్, బీజాపూర్ (CG) సీపీఐ మావోయిస్టు
6 మడకం భీమయ్య (36) మిలీషియా సభ్యుడు, పలగూడెం RPC గోమ్గూడ, పామేడు పీఎస్, బీజాపూర్ (CG) సీపీఐ మావోయిస్టు

పోలీసులు ఆదివాసీలకు విజ్ఞప్తి చేస్తూ— భయంతో లేదా నమ్మకంతో మావోయిస్టులకు సహకరించడం ఆపి, ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793