ఘోర అగ్నిప్రమాదం ఐదుగురి సజీవ దహనం
బెంగళూరులోని సెంట్రల్ సిటీ నగర్తపేటలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురుతో పాటు మరో వ్యక్తి మృతిచెందడం నగరమంతా కలకలం రేపింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సందీప్, బాలకృష్ణ అనే ఇద్దరికి చెందిన నాలుగు అంతస్తుల భవనంలో కింద రెండు దుకాణాల్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వస్తువులు నిల్వచేశారు. శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగి క్షణాల్లోనే భవనాన్ని కమ్మేశాయి. మొదట కింద అంతస్తులో ప్రారంభమైన మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో సురేష్ (31) అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. అదే సమయంలో మంటలు మూడో అంతస్తులోకి చేరడంతో అక్కడ నివసిస్తున్న **మదన్కుమార్ (38), ఆయన భార్య సంగీత (33), పిల్లలు మితేశ్ (8), విహన్ (5)**లు చిక్కుకుని సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది భారీగా చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే ఐదుగురి ప్రాణాలు బలయ్యాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, మంటలకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
Post a Comment