సర్పంచ్ ఎన్నికల్లో సంచలనం: మరణించిన అభ్యర్థి ఘన విజయం
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం – డిసెంబర్ 12: చింతల్ ఠాణాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అరుదైన మరియు ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. పోలింగ్కు రెండు రోజుల ముందు గుండెపోటుతో మృతిచెందిన బీఆర్ఎస్ అభ్యర్థి చెర్ల మురళి కుదిరిన ఫలితాల్లో ఘన విజయం సాధించడం గ్రామంలో హాట్టాపిక్గా మారింది.
ఎన్నికల ప్రచారంలో ఉండగానే విషాదం
బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న చెర్ల మురళి (50), గ్రామంలో చురుకైన ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అతని మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
పోలింగ్ పత్రాల్లో పేరు మార్చలేకపోవడంతో…
అభ్యర్థి మరణించినప్పటికీ పోలింగ్ పత్రాల్లో పేరు మార్చే అవకాశం లేకపోవడంతో ఓటర్లు తమ మద్దతు నిచ్చిన మురళికే ఓట్లు వేశారు. గురువారం వెలువడిన ఫలితాల్లో చెర్ల మురళి 700 కంటే ఎక్కువ ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీతో గెలువడం విశేషం.
తదుపరి చర్యలకు తాత్కాలిక బ్రేక్
విజేతగా ప్రకటించిన అభ్యర్థి భౌతికంగా లేని నేపథ్యంలో సర్పంచ్ పదవిపై తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
గ్రామంలో ఆసక్తికర చర్చ
చింతల్ ఠాణా సర్పంచ్ ఎన్నికల ఫలితం ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది.

Post a Comment