హైదరాబాద్లో ఇంధన కొరతపై స్పష్టత – సీపీ సజ్జనర్ భరోసా
హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని V. C. Sajjanar స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
నగరంలో రాబోయే 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇటీవల వదంతుల కారణంగా ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వివరించారు. ఈ నెల 22న 3,024 KL విక్రయాలు నమోదవగా, 23న అవి 6,400 KLకు పెరిగాయి. ప్రజలు ఒకేసారి బంకులకు వెళ్లి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో కొన్ని చోట్ల తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు కనిపించాయని చెప్పారు.
ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోందని, ఆయిల్ కంపెనీలతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని సీపీ వెల్లడించారు. అలాగే బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ ఇంధనాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై పోలీసుల నిఘా ఉందని, చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. నగరంలోని సుమారు 240 పెట్రోల్ బంకులపై పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

Post a Comment